Friday, 17 April 2026 05:06:33 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

ఆకుపాముల గ్రామ నివాసి లిక్కి కృష్ణంరాజు వారి కుమారుడు లిక్కి వర్షిత్ సాహస యాత్ర విజయవంతం

Date : 12 April 2026 09:50 AM Views : 13

DNB News - తెలంగాణ / : మునగాల మండల ఆకుపాముల గ్రామ నివాసి అయిన శ్రీ లిక్కి కృష్ణంరాజు (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మల్కాజ్గిరి కమిషనరేట్), వారి కుమారుడు లిక్కి వర్షిత్ (8వ తరగతి విద్యార్థి) , రాజుల శ్రీనివాస్ గారు (కృష్ణంరాజు బావగారు) మరియు కొమురబండ, ఆకుపాముల గ్రామ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు శ్రీ మల్లెబోయిన సత్యనారాయణ గారు నలుగురు కలిసి 2026 మార్చి 28వ తేదీ నుండి 14 రోజులపాటు నేపాల్ దేశంలోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5434 మీటర్ల ఎత్తు) ను ట్రెక్కింగ్ ద్వారా విజయవంతంగా చేరుకొని, ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వారి ఈ సాహస యాత్ర పట్ల మునగాల మండల ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలంలోని యువత మరియు ప్రజలు వీరి యాత్రను ఆదర్శంగా తీసుకుని, ఇలాంటి సాహస యాత్రల్లో పాల్గొనాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వారి యాత్ర వివరాలు వారి మాటల్లోనే ఇలా ఉన్నాయి: హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా విమానంలో కాఠ్మాండు (త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం) కు చేరుకుని, అక్కడి నుండి వాహనం ద్వారా రామేఛాప్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుండి చిన్న విమానం ద్వారా లుక్లా విమానాశ్రయానికి చేరుకొని,(ప్రపంచంలో అతి చిన్న రన్వే కలిగిన విమానాశ్రయం) అక్కడి నుండి ట్రెక్కింగ్ ప్రారంభించి 7 రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో 3 రోజుల్లో లుక్లాకు చేరుకుని, అక్కడి నుండి తిరిగి కాఠ్మాండు ద్వారా భారతదేశానికి వచ్చారు. ఈ యాత్రలో 5434 మీటర్ల ఎత్తుకు చేరడం, మైనస్ 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం, అక్కడి ఆహారం మరియు జీవన విధానాన్ని అనుభవించడం వంటి అనేక కొత్త అనుభూతులను పొందినట్లు వారు తెలిపారు. జీవితం అనేది ఒక ప్రయాణమని, ఇలాంటి యాత్రలు మనిషికి అమూల్యమైన అనుభవాలను, జ్ఞానాన్ని అందిస్తాయని వారు పేర్కొన్నారు. చివరిగా, “జీవితం అంటేనే ఒక ప్రయాణం” అని మనందరం గుర్తుంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :