DNB News - తెలంగాణ / : కర్ల రాజేష్ మరణానికి కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని ఉత్తమ్ దంపతులే కాపాడుతున్నారని , గత 60 రోజులుగా మాదిగ జాతి న్యాయం కోసం పోరాటం చేస్తుంటే వారు మౌనంగా ఉంటున్నారని, వారికి దమ్ముంటే కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన మీద మౌనం వీడాలని లేకుంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ' పద్మశ్రీ ' మంద కృష్ణ మాదిగ గారు డిమాండ్ చేశారు. మునగాల మండల కేంద్రంలో కర్ల రాజేష్ సంతాప సభను MRPS ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు మండల అధ్యక్షులు కనకయ్య మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన మంద కృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ " కర్ల రాజేష్ మృతికి నూటికి నూరుశాతం పోలీసులే కారణం.అందుకు తగిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని అన్ని విధాలుగా నిరూపిస్తామని అన్నారు. ఈ వాదనతో గత 60 రోజులుగా పోరాటం చేస్తున్నా కనీసం పోలీసుల నుండి ఏ సమాధానం లేదని అన్నారు. రాజేష్ ను చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకొని, చట్టవిరుద్ధంగా తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని ఆ కారణంగానే ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయాడని అన్నారు
Admin
DNB News