DNB News - తెలంగాణ / : కరీంనగర్లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) అధ్యాపకులు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రచారంలో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు కళాశాల వివరాలను తెలియజేశారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కరపత్రాలను అందజేసి ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని సుమారు 20 ఇంటర్ పరీక్ష కేంద్రాలను అధ్యాపకులు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి కళాశాల ప్రత్యేకతలను వివరించారు. కళాశాలలో ఉన్న నాణ్యమైన విద్యా బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం మరియు ఇతర విద్యా సౌకర్యాల గురించి విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా డోస్ట్ (DOST) ద్వారా డిగ్రీ కోర్సులకు ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా విద్యార్థులకు తెలియజేశారు. అడ్మిషన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్స్ పి.నితిన్ , టి.రాజయ్య, టి.జి.సి.జి.టి.ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సురేందర్ రెడ్డి, ఐక్యూఎసి కోఆర్డినేటర్ డాక్టర్ హర్జ్యోత్ కౌర్, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. రామకృష్ణ అభినందించారు.
Admin
DNB News