Saturday, 01 August 2026 06:37:00 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి – ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద అధ్యాపకుల ప్రచారం

Date : 10 March 2026 06:07 PM Views : 105

DNB News - తెలంగాణ / : కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) అధ్యాపకులు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రచారంలో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు కళాశాల వివరాలను తెలియజేశారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కరపత్రాలను అందజేసి ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని సుమారు 20 ఇంటర్ పరీక్ష కేంద్రాలను అధ్యాపకులు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి కళాశాల ప్రత్యేకతలను వివరించారు. కళాశాలలో ఉన్న నాణ్యమైన విద్యా బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం మరియు ఇతర విద్యా సౌకర్యాల గురించి విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా డోస్ట్ (DOST) ద్వారా డిగ్రీ కోర్సులకు ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా విద్యార్థులకు తెలియజేశారు. అడ్మిషన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్స్ పి.నితిన్ , టి.రాజయ్య, టి.జి.సి.జి.టి.ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సురేందర్ రెడ్డి, ఐక్యూఎసి కోఆర్డినేటర్ డాక్టర్ హర్జ్యోత్ కౌర్, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. రామకృష్ణ అభినందించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :