DNB News - తెలంగాణ / : రాష్ట్రంలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా ప్రయాణించేందుకు రింగ్ రోడ్లు ఉపయోగపడతాయని తెలిపారు. రోడ్లు–భవనాల శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి Komatireddy Venkat Reddyతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల సమీపంలో ఉన్న రహదారులను అనుసంధానించి రింగ్ రోడ్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జాతీయ రహదారులతో ఈ రింగ్ రోడ్లను అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. Hyderabad–Vijayawada ఎక్స్ప్రెస్ వే నుంచి Nagarjuna Sagar వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపై కూడా అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, ఆర్యూబీల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన కొత్త ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే బోధన ఆసుపత్రులు మరియు ఇతర పెద్ద ఆసుపత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Admin
DNB News