DNB News - తెలంగాణ / : మునగాల:మండలకేంద్రంలో స్థానికతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర రూపశిల్పి విసనరీ లీడర్, తెలుగుదేశం పార్టీ రథసారథి తెలుగు ప్రజల భవిష్యత్తు ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీకార్యాలయంలో కేకు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు,ఈసందర్భంగామండల తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నాదెళ్ల గోపాల్ రావు, మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని తెలుగు ప్రజలకు తన చివరి శ్వాస వరకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఆయనకు ఇవ్వాలని ఆయన కలలుగన్న స్వర్ణాంధ్ర ప్రదేశ్ సా కారమయ్యేంతవరకు మనకు భగవంతుడు తోడుగా నిలవాలని ఆయన ఆశయ సాధన లో చివరి వరకు ఆయనతో నడిచే అవకాశం మాకు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు ఆయన మార్గదర్శకత్వం యువ నాయకుడు శ్రీ నారా లోకేష్, సారధ్యంలో పార్టీ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లోకేష్ గారి ఉన్నతికి బాబు గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని తండ్రి కొడుకులు వారికున్న అపార అనుభవంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మరింత మంచి చేసేందుకు వారికి సంపూర్ణ ఆయుష్షుని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా మని తెలియజేశారు.ఈకార్యక్రమంలో శ్రీ పూర్ణ శంకర్, బరాకత్ గూడెం గ్రామసర్పంచ్ చల్లా గురవయ్య, జిల్లాపార్టీ నాయకులు శ్రీ కృష్ణారెడ్డి, గాడిపర్తి మోహన్ రావు, మామిడి గురునాధం, శ్రీ వేట అశోక్, శ్రీ సైదులు, దేవినేని రాఘవేంద్రరావు,చలసాని మాధవరావు, కాశయ్య, మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News