DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కలకోవగ్రామంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది.తన కొడుకుని కోల్పోయి ఇల్లు లేక ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న పనస వెంకటమ్మ, ఒక పేద మహిళ గ్రామస్తులు, దాతలు కలిసి,నూతనగృహాన్ని నిర్మించి అందజేశారు.ఈసందర్భంగా గ్రామపెద్దలు,ఉద్యోగస్తులు,యువకులు, దాతలు కలిసి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళకు ధైర్యం చెప్పారు. “సమాజంలో ఎవరూ ఒంటరిగా ఉండకూడదు” అనే సందేశంతో అందరూ ఒక్కటై ఈసహాయం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.దాతల సహకారంతో నిర్మించిన ఈఇంటిని మహిళకుఅధికారికంగా అందజేయగా,ఆమెభావోద్వేగానికి గురై సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామంలోని యువత,పెద్దలు కలిసిచేసిన, ఈసేవాకార్యక్రమం అందరికీ ఆదర్శంగానిలిచింది. ఈకార్యక్రమంలోగ్రామమాజీ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు,మాజీ ఎంపీటీసీ సభ్యులు గన్న భవాని నరసింహారావు,ఉపసర్పంచ్ అమరగాని వీరభద్రం గౌడ్, సొసైటీ డైరెక్టర్ మండవ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీప్రధాన కార్యదర్శి పనస విజయ్, కుడుముల వీరయ్య, వార్డు సభ్యులు సిద్దుల వీరయ్య,పాతకోట్ల రమణ సోమయ్య, బొడ్డుపల్లి సావిత్రి శ్రీనివాస్, ఇంటిని నిర్మాణం పూర్తి చేసిన మేస్త్రి సిద్దుల నాగేశ్వరరావు,గణేష్ యూత్ సభ్యులు పనసకోటి, కొంపెల్లి ప్రశాంత్, బెల్లంకొండ మధు,తొండల నరేష్ సిమ్మట గోపి,మండవ ప్రవీణ్, పనస వీరకోటయ్య, మండవ ఎంకన్న, ప్రముఖులు,దాతలు,యువకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News