DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయానికి నూతనంగా నియమితులైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఉపకులపతికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వవిద్యాలయం అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, పరిపాలనా వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై పరస్పరం చర్చించి విశ్వవిద్యాలయాన్ని విద్యాబోధనలో పరిశోధనలలో ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేయగా ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ నూతన సభ్యులకు అభినందనలు తెలియజేసి, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ ఇతర విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు
Admin
DNB News