DNB News - తెలంగాణ / : పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు శుక్రవారం మధిర నియోజకవర్గం వర్గంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. బోనకల్ మండలం లక్ష్మిపురం లో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ ప్రాంతాలను తిరిగుతూ పనుల నాణ్యతను క్షేత్రస్థాయిలో భవనాల నమునా మ్యాప్ లను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల వద్ద లింక్, అంతర్గత రోడ్డు, విద్యుత్ సరఫరా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, మధిర నియోజకవర్గం ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విద్యా వ్యవస్థకు పోటీ ప్రపంచానికి పోటీ పడే విధంగా మన విద్యార్థులను తయారు చేసుకునేందుకు అవసరమైన మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఉత్తమైన చదువు అందించే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందించేందుకు సమీకృత విద్యా సంస్థలను ఏర్పాటు చేసే సంకల్పానికి అధికారులు సమన్వయంతో పని చేసి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా పరిధిలో ఐదు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరు అయి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలు విద్యలో సమూలమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయని నిర్మాణంలో పేదపిల్లల బంగారు భవిష్యత్తుకు నాణ్యమైన నిర్మాణ పనులను పూర్తి చేసి సకాలంలో అందించేలాగ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరితగతిన వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసి పిల్లలకు అందుబాటులో తీసుకురావాలని, నిర్ణిత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని, పనుల పురోగతి వివరాలను ఎప్పటి కప్పుడు నివేదికలు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారి బుగ్గయ్య, బోనకల్ మండల తహసీల్దారు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ---------------------------- జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.
Admin
DNB News