DNB News - తెలంగాణ / : మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామపంచాయతీ కార్యాలయంలో మహానుభావుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల సైదులు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రేపాల గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేశారు.అనంతరం మాట్లాడుతూ.అణగారిన వర్గాల హక్కుల కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినదని పేర్కొన్నారు. జయంతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా వెటర్నరీ డాక్టర్ మమత పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించి వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించేందుకు సంకల్పం వ్యక్తం చేశారు.
Admin
DNB News