DNB News - తెలంగాణ / : వెలుగుమట్ల భూ నిర్వాసితులకు అండగా మార్చి 22న ఖమ్మం నగర బంద్ కు CPI (ML - న్యూ డెమోక్రసీ) పిలుపు... ఖమ్మం శివారు వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కూల్చి వేసిన దగ్గరే ఇళ్ల నిర్మాణం చేయాలని CPI (ML - న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు ఆవునూరి మధు కోరారు. సమస్య పరిష్కారానికి ఈ నెల 22న ఖమ్మం నగర బందులో ప్రజలు, పార్టీ శ్రేణులు, వివిధ వ్యాపార వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొని, విజయవంతం చేసి, నిరుపేదలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో నాయకులు మాట్లాడారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య మాట్లాడుతూ బందు సందర్భంగా నగరంలో భారీగా మోటార్ సైకిల్ ప్రదర్శన, విస్తృతంగా కరపత్రాలతో ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో CPI (ML - న్యూడెమోక్రసీ) రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్ర ప్రసాద్, జిల్లా నాయకులు వెంకట్రామిరెడ్డి, వై ప్రకాష్, ఖాసిం, గిరి, సురేష్, లక్ష్మి, గొర్రెపాటి రమేష్, సుదర్శన్, మోహన్ రావు, జానకి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News