DNB News - తెలంగాణ / : అణ గారిన వర్గాలకు ఆద్యులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు బడుగు, బలహీన వర్గాలు ఐకమత్యంతో ముందుకు సాగాలని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ వారసుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు వానపాకుల రాంబాబు అన్నారు. మున్సిపల్ పరిధి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో బహుజన నాయకులతో కలిసి, గురువారం పాత్రికేయులతో మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొమరం భీమ్ ప్రాంగణంలో శుక్రవారం ధూమ్ దాం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాష లు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ వాదం ఉట్టిపడేలా తెలంగాణ కళాకారులు పాటమ్మ రాంబాబు, చుక్క రాంనర్సయ్య, పమ్మి రవి లచే సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. నేడే బహుజన గళం ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహుజనుల ఆద్యులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడుతూ.. ధూమ్ ధామ్ కార్యక్రమం ఉంటుందని వానపాకుల పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేటర్లను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మెమొంటో లు అందజేస్తామన్నారు. బహుజనులు, కళాకారులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద మొత్తంలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు శివాటి మల్లేష్, ఉపాధ్యక్షులు గంగాధర సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లూరి సాంబశివరావు, భరత్ చంద్ర, ఇరుగు రాజు, మెంతిన సమ్మయ్య, మహిళా నాయకురాళ్లు పూనెం సీత, నక్క లావణ్య, అనపర్తి పుష్ప, కొమరం సరస్వతి లు పాల్గొన్నారు.
Admin
DNB News