Saturday, 19 September 2026 11:24:49 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్

Date : 14 March 2026 10:24 AM Views : 103

DNB News - తెలంగాణ / : దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మెడికల్ వీసాలతో భారత్‌లో కొనసాగుతున్న పది మంది బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో భాగంగా పీర్‌ఘర్హి చౌక్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు చెందిన పది మంది వ్యక్తులు నకిలీ మెడికల్ వీసాలతో భారత్‌లో ఉంటున్నట్లు బయటపడింది. ఈ వ్యక్తులు మొదట మెడికల్ వీసాలపై భారత్‌కు వచ్చినప్పటికీ, వారి వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే అక్రమంగా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా సరైన ప్రయాణ పత్రాలు లేకపోయినా యూరప్ దేశమైన బల్గేరియాకు వెళ్లేందుకు మెడికల్ వీసాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం విదేశీయుల నమోదు కార్యాలయం అధికారులు వారి వివరాలను పరిశీలిస్తూ స్వదేశానికి పంపించే ప్రక్రియను ప్రారంభించారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్న విదేశీయులపై తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :