DNB News - తెలంగాణ / మెదక్ జిల్లా : నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టి మేషన్ (AITE )మెదక్ జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మెదక్ అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అటవీశాఖ అధికారి జోజీ తో కలిసి ఉదయం పోచారం అభయాఅరణ్యం కింద ఉన్న బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న జంతు గణన ను పరిశీలించారు. మూడు రోజులపాటు మాంసాహార జంతువుల గణన తదనంతరం మరో మూడు రోజులపాటు శాకాహార జంతువుల గణన ఉంటుందని అదనపు కలెక్టర్ మేంచు నగేష్ తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి జో జీ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఆరు రేంజ్ లు, 98 బిట్ ల లో మాంసాహార జంతు గణన కొనసాగుతుందన్నారు. చిరుత పులులు ఎలుగుబంటి, నిల్ గాయి, కొండ గొర్రె తదితర జంతువుల పాదముద్రలను విసర్జితలు,జంతువుల వెంట్రుకలు,గోళ్ళు, తదితరాలను ఏం స్క్రిప్ట్ యాప్ లో నమోదు చేస్తున్నారాని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు, మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్ ఐ లక్ష్మణ్, డి టి చరణ్, ఎఫ్ ఆర్ ఓ మనోజ్ కుమార్ , డి ఆర్ ఓ వేణు ,ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News