DNB News - తెలంగాణ / : మునగాల... మాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం వరం లాంటిదని ఈ చట్టం పేదలకు మేలు చేస్తుందని మోడీ ఇటీవల తీసుకొచ్చిన జి రామ్ జి పథకం కూలీల కళ్ళల్లో మట్టి కొట్టే విధంగా ఉందని జి రాంజీ రద్దుకై కూలీలందరూ ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లిరాములు పిలుపునిచ్చారు బుధవారం మండల కేంద్రంలో సుందరయ్య భవనంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మండల మూడోవ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిందని గుర్తు చేశారు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత జిరాంజీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు ఈ పథకంలో కొత్త కొత్త అంశాలు చెప్పించి పేదలకు పనులు లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు పూటల ఫోటో సిస్టం వల్ల కూలీలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు క్షేత్రస్థాయిలో పని ప్రదేశంలో సిగ్నల్ వ్యవస్థ సరిగా లేక వ్యవసాయ కూలీల ఆందోళన చెందుతున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని వ్యవసాయ కూలీలకు చేతినిండా పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు గత సంవత్సరానికి పోల్చుకుంటే జిల్లాలో పనుల సంఖ్య తగ్గుతుందని ఇది అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు తెలిపారు రానున్న కాలంలో ఉపాధి మీద జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వామిగాలని పిలుపునిచ్చారు యొక్క మహాసభలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బురి శ్రీరాములు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోంపంగు జానయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి నాయకులు రామదాస్ మండల కమిటీ సభ్యులు ములకలపల్లి సైదులు కిన్నెర వెంకన్న తుమ్మ సతీష్ కొలిశెట్టి నాగయ్య రావులపెంట వెంకన్న అమర గాని కనకయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం నూతన కమిటీ 17 మందితో ఎన్నుకోవడం జరిగింది మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా అధ్యక్షులుగా బచ్చలకూరి రామదాస్ ప్రధాన కార్యదర్శి సోమపంగు జానయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
Admin
DNB News