DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన _ ప్రగతి ప్రణాళిక గ్రామసభను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు జూలకంటి విజయలక్ష్మి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయడంలేదని, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తామన్న 2500/-ఇవ్వడంలేదని, మాగ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని మరియు రైతులకు ఇచ్చే రైతుభరోసా నిదులు ఒక్క ఎకరానికి మాత్రమే విడుదల చేసారని మహిళాసంఘాలకు ఇచ్చే డ్వాక్రా రుణాలు, స్వయం ఉపాధి మార్గాలలో జాప్యం జరుగుతుంది వారు అన్నారు.
Admin
DNB News