Tuesday, 21 April 2026 03:32:01 PM
# సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ # ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి... అదనపు కలెక్టర్ లు # పనులు నాణ్యతతో నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి # ప్రైవేటు ట్రావెల్స్ కు కళ్లెం.. 'ఒకే దేశం, ఒకేవిధానం' రద్దు # నిర్మల్ పోలీస్... మీ పోలీస్ # రైలు ప్రయాణంలో చెత్త వేస్తే భారీ జరిమానా # ఇతను తండ్రి కాదు....కూతుళ్ళ పాలిట యముడు ....కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేసిన తండ్రి # కర్నూలులో మహాత్మా బసవేశ్వర 893వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ..

ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి... అదనపు కలెక్టర్ లు

Date : 20 April 2026 05:34 PM Views : 3

DNB News - తెలంగాణ / : ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించా లని అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ పి. శ్రీనివాస్ రెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన రాయల గోవింద రావు పీఎం ఉపాధి కల్పన పథకం క్రింద ఈడిపి ట్రైనింగ్ అందుబాటులో లేకపోవడం ఆన్లైన్ పోర్టల్ లోపల లోన్ ప్రాసెస్ ఆలస్యం అవుతున్న విషయం గురించి ఫిర్యాదు అందించగా కే.వి.ఐ.బి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. కొణిజెర్ల మండలం చిన్న గోపతీ గ్రామానికి చెందిన జి. ప్రసాద్ రావు తనకు సర్వే నెంబర్ 131 లో 39 గుంటల భూమి ఉందని, 19.5 గుంటల భూమి పట్టా పాస్ పుస్తకం ఉందని, మిగిలిన 19.5 గుంటల భూమి పట్టా పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం అర్బన్ మండలం అల్లిపురం గ్రామానికి చెందిన ఎస్కే హుస్సేన్ తనకు 4 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చిందని , తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా డిఆర్డిఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ పద్మశ్రీ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :