DNB News - తెలంగాణ / : కరీంనగర్ నగరంలోని డిమార్ట్ రోడ్లో, ఈ ఎన్ గార్డెన్స్ ఎదురుగా నిర్మితమైన స్వయం రెస్టారెంట్, బాంకెట్ హాల్, గదుల సముదాయాన్ని బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన రెస్టారెంట్లు, బాంకెట్ హాళ్లు అవసరం పెరుగుతున్నాయని తెలిపారు. స్వయం రెస్టారెంట్ వంటి సముదాయాలు ప్రజలకు మంచి వాతావరణంలో సేవలు అందించడమే కాకుండా, నగర అభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలు ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త జైపాల్ రెడ్డి, ఎసిపి వెంకటస్వామి సిఐ తిరుమల్ స్థానిక కార్పొరేటర్లు ఒంటెల సత్యనారాయణ రెడ్డి, గుమ్మడి రాజ్ కుమార్, రమణారెడ్డి, బండారి వేణు పాల్గొన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు మడ్లపల్లి సాయి కృష్ణ, బూస సాయిశ్రవణ్ , అన్నిండ్ల ఉత్తేజ్ చేకుర్తి సురేందర్, సజ్జనపు సాయికుమార్ అతిథులను ఆహ్వానించి ఏర్పాట్లు చేశారు. అలాగే నాయకులు పొన్నం సత్యం, కృష్ణ గౌడ్, వెల్చాల తిరుమల్ రావు, మడ్లపల్లి శ్రీనివాస్, పడిదపల్లి కిషన్, రేండ్ల రాజిరెడ్డి, రామిడి రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులు సముదాయంలోని సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
Admin
DNB News