DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో ఉన్న. మసీదులో గ్రామానికి చెందిన ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు యువత తో. కలిసి ప్రార్థనలు చేసిన గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. తదుపరి సత్యనారాయణ మాట్లాడుతూ. గడచిన నెల రోజులుగా ఎంతో భక్తిశ్రద్ధలతో నియమ నిబంధనలతో. ఉపవాస దీక్షలు చేపట్టి నేడు. రంజాన్ పర్వదినం సందర్భంగా. సామూహిక ఉపవాస దీక్షలు విరమించే సందర్భంగా. ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపి. ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని. ప్రస్తుతం భారతదేశంలో. ఇతర దేశాలైన ఇరాన్ ఇజ్రాయిల్. దేశాలు యుద్ధం కొనసాగిస్తున్నందువల్ల ఆ ప్రభావం మన దేశంపై పడి నిత్యవసర వస్తువులు. ముఖ్యంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడి. ఎంతోమంది ఉపాధికి దూరమవుతున్నారని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని. ఏదైనా సమస్యలో వస్తే శాంతియుతంగా సామరస్య పూర్వకంగా శాంతి చర్చలు జరపాలని. ఆ అల్లా దయతో యుద్ధం ఆగిపోవాలని. ఆకాంక్షించారు. ఈ పండగలు పర్వదినాలు మతసామరస్యానికి ప్రతీకని. మన మతాలను పూజించుకోవడం ఇతర మతాలను గౌరవించాలని. ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు. అలాగే. నేటి వరకు ముస్లింలకు ఎలాంటి రాజకీయ పదవులు తమ గ్రామంలో లేవని. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో మొట్టమొదటిసారిగా వార్డు సభ్యుడిగా ముస్లిం సోదరుడు. ఎన్నిక కావడం సంతోషమని. ఈ సందర్భంగా ఒకటో వార్డు నుంచి వార్డు సభ్యుడిగా ఎన్నికైన షేక్ అజీజ్ మియ ను. సర్పంచి సన్మానించాడు. తదుపరి ముస్లింల సంక్షేమానికి. ఇతర మౌలిక సదుపాయాలకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో. ముస్లిం మత పెద్దలు . ఇమాం . షేక్ ఖలీల్. సదర్ ఇలియాస్ నాగుల్ .నాగుల్ మీరా మన్సూర్ . మదార్సా. బాబా . హుస్సేన్ . పాషా . బాబు . చాంద్. నజీర్ . లతీఫ్. జాని. అధిక సంఖ్యలో ముస్లీం యువకులు పాల్గొన్నారు
Admin
DNB News