Saturday, 01 August 2026 09:01:39 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

విద్యార్థులు విజయోస్తూ..!

Date : 13 March 2026 05:01 PM Views : 76

DNB News - తెలంగాణ / : కన్నవారి కలలను నెరవేర్చేందుకు.. ఉజ్వల భవిష్యత్తును అందుకునేందుకు పదవ తరగతి విద్యార్థులు ఈనెల 14వ తేదీ నుంచి జరిగే పరీక్షలను మంచిగా రాసి ఉత్తీర్ణులు అవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాయనున్న 5, 17,727 మంది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్ష కేంద్రాలకు సమయానికన్నా అరగంట ముందు కచ్చితంగా వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో పరీక్ష రాయనున్న విద్యార్థులందరికీ ముందస్తుగా అభినందనలు తెలిపారు. విద్యార్థులకు చదువుపై ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని తాను పదవ తరగతి చదివే పేద విద్యార్థులందరికి దాదాపుగా 20వేల మందికి ఉచితంగా సైకిళ్లను అందించాననే విషయాన్ని గుర్తు చేశారు. దీంతో పాఠశాలకు విద్యార్థులంతా సకాలంలో వెళ్లేందుకు అవకాశం దక్కిందని చెప్పారు. అంతేకాకుండా పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును తాను చెల్లించానని దీంతో వారి తల్లిదండ్రులకు కొంత ఆర్థిక భారం తప్పిందన్నారు. పరీక్షల సమయంలో అనవసరమైన ఆందోళన ఒత్తిడికి గురి కాకూడదని ఇన్నాళ్లు శ్రద్ధతో చదివిన సబ్జెక్టులను పునశ్చరణ చేసుకొని మంచిగా పరీక్ష రాయాలని హితవు పలికారు. గతేడాది పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా ఉత్తీర్ణతా పరంగా ఆరో స్థానంలో సిరిసిల్ల జిల్లా ఐదవ స్థానంలో నిలిచిందని.. ఈసారి తప్పకుండా ఈ రెండు జిల్లాలు మొదటి రెండవ స్థానాల్లో నిలిచి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు పోలీసులు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు రవాణా పరంగా ట్రాఫిక్ పరంగా ఇబ్బంది ఉండకుండా చూడాలని సూచించారు. తాను ఈ నెల 14వ తేదీన చేపడుతున్న కొండగట్టు అంజన్న పాదయాత్ర సమయంలోను ఎక్కడ కూడా విద్యార్థులకు అసౌర్యం కలగకుండా చూసుకుంటామని ఈ దిశగా నాయకుల్ని, కార్యకర్తలను సమాయత్తం చేశామన్నారు. పరీక్ష కేంద్రాలను విద్యార్థులకు తగిన వసతులను కల్పించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వారికి ఫ్యాన్ల సదుపాయంతో పాటు మంచినీళ్లు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు విద్యార్థులను తల్లిదండ్రులు క్షేమంగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి పరీక్ష లో పాసై ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని శత శాతం ఫలితాలు సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :