DNB News - తెలంగాణ / : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా నిర్వహిస్తున్న బాలల భద్రత డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం సందర్భంగా మునగాల పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రజా రవాణా వాహనాలను బస్సులు ఆటోలు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలను తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలను ఎవరైనా తరలిస్తున్నారా అని నిగా ఉంచారు. అనంతరం స్థానిక ప్రజలకు ఎస్ఐ అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనే మహమ్మారి పీడిస్తున్నదని దీని బారి నుండి మన పిల్లలను యువతను మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. డ్రగ్స్ మత్తుకు బానిసలై యువత ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారని బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని తెలిపారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు సరఫరా జరగకుండా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేసిందని దీనికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించి డ్రగ్స్ నిర్మూలన భాగస్వామ్యం కావాలని తెలియజేశారు.
Admin
DNB News