Friday, 17 April 2026 05:04:21 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

కర్ణాటకలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

Date : 17 March 2026 03:52 PM Views : 24

DNB News - తెలంగాణ / : కర్ణాటకలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన కేవలం 60 రోజుల్లోనే భర్తను హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన టిప్టూరు గ్రామీణ ప్రాంతంలోని చిక్కకోట్టగిహళ్లి వద్ద చోటుచేసుకుంది. మృతుడు మన్‌సూర్ పాషా (31)… స్క్రాప్ వ్యాపారి. మార్చి 4న స్క్రాప్ సేకరించేందుకు వెళ్లిన మన్‌సూర్… అనుమానాస్పదంగా అదృశ్యమయ్యాడు. తర్వాత అతని మృతదేహం తోటలో లభించింది. ఈ కేసులో పోలీసులు మన్‌సూర్ భార్య ఫర్ఝానాతో పాటు… ధనరాజ్, వెంకటేష్, దర్శన్ అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఫర్ఝానాకు ధనరాజ్‌తో గత 7 నెలలుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి వివాదం రావడంతో… ఈ ఏడాది జనవరిలో ఫర్ఝానాకు మన్‌సూర్‌తో వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయిన తరువాత కూడా ఫర్ఝానా… ధనరాజ్‌తో రహస్యంగా సంబంధం కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికోసం కొత్త సిమ్ కార్డు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి మన్‌సూర్‌ను తొలగించేందుకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 4న దర్శన్ సహాయంతో… స్క్రాప్ ఉందని చెప్పి మన్‌సూర్‌ను పిలిపించి… కార్ షాక్ అబ్జార్బర్‌తో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై చిక్కమగళూరు సహా పలు ప్రాంతాల్లో పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపి… నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండగా… కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :