DNB News - తెలంగాణ / : కర్ణాటకలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన కేవలం 60 రోజుల్లోనే భర్తను హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన టిప్టూరు గ్రామీణ ప్రాంతంలోని చిక్కకోట్టగిహళ్లి వద్ద చోటుచేసుకుంది. మృతుడు మన్సూర్ పాషా (31)… స్క్రాప్ వ్యాపారి. మార్చి 4న స్క్రాప్ సేకరించేందుకు వెళ్లిన మన్సూర్… అనుమానాస్పదంగా అదృశ్యమయ్యాడు. తర్వాత అతని మృతదేహం తోటలో లభించింది. ఈ కేసులో పోలీసులు మన్సూర్ భార్య ఫర్ఝానాతో పాటు… ధనరాజ్, వెంకటేష్, దర్శన్ అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఫర్ఝానాకు ధనరాజ్తో గత 7 నెలలుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి వివాదం రావడంతో… ఈ ఏడాది జనవరిలో ఫర్ఝానాకు మన్సూర్తో వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయిన తరువాత కూడా ఫర్ఝానా… ధనరాజ్తో రహస్యంగా సంబంధం కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికోసం కొత్త సిమ్ కార్డు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి మన్సూర్ను తొలగించేందుకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 4న దర్శన్ సహాయంతో… స్క్రాప్ ఉందని చెప్పి మన్సూర్ను పిలిపించి… కార్ షాక్ అబ్జార్బర్తో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై చిక్కమగళూరు సహా పలు ప్రాంతాల్లో పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపి… నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండగా… కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Admin
DNB News