DNB News - తెలంగాణ / : మునగాల: మునగాల మండల పరిధిలోని,కోదండరామాపురం గ్రామంలో జాతీయ ఉపాధిహామీ చట్టం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు 600 రూపాయలకు చెల్లించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లాఅధ్యక్షులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు శుక్రవారం మండల పరిధిలోని కోదండరాంపురం గ్రామంలో ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సందర్శించి ఆయన కూలీల ఉద్దేశించిమాట్లాడారు, ఈసందర్భంగా ములకలపల్లి రాములు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వ్యవసాయ కూలీలకు రోజుకు 600 రూపాయల కూలి చెల్లించాలని ఉన్నప్పటికీ అది అమలు జరగట్లేదని ఆయన అన్నారు వేసవిలో తీవ్రమైన ఎండల్లో కష్టపడి పని చేస్తున్న సరైన వేతనం చెల్లించట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వేసవిలో అదనపు కూలి ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం దాని అమలు జరపట్లేదని ఆయన అన్నారు,కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీచట్టములో ఉన్న మౌలిక అంశాలను తీసివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి హామీ చట్టరక్షలకు కూలీలు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు,ఈకార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లాఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, జిల్లాకమిటీ సభ్యులు అరె రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకన్న,ఉపాధి మెట్లు కూలీలు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News