Saturday, 19 September 2026 07:16:48 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

హైదరాబాద్‌లో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు

Date : 10 March 2026 06:15 PM Views : 102

DNB News - తెలంగాణ / : చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అంబర్‌పేట్ పోలీసులతో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, అంబర్‌పేట్ పరిధిలోని అలీ కేఫ్ క్రాస్ రోడ్ వద్ద ముగ్గురు వ్యక్తులు తుపాకీతో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక దేశీయ తయారీ తుపాకీ, ఆరు లైవ్ రౌండ్లు, ఒక మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక ఎలక్ట్రిక్ స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు మల్కాజిగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధమరా అరుణ్ కుమార్, జవహర్ నగర్‌కు చెందిన పాన్ షాప్ నిర్వహిస్తున్న మహ్మద్ అబ్బు, యాకుత్‌పురాకు చెందిన విద్యార్థి మీర్ ముజమ్మిల్ అలీ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధమరా అరుణ్ కుమార్ తన రెండో భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు తన బంధువుతో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దీంతో అరుణ్ కుమార్ గత సంవత్సరం నవంబర్‌లో మహ్మద్ అబ్బును సంప్రదించి తుపాకీ ఏర్పాటు చేయాలని కోరాడు. అబ్బు, మీర్ ముజమ్మిల్ అలీ ఖాన్‌ను పరిచయం చేయగా, ముజమ్మిల్ తుపాకీని ఏర్పాటు చేస్తానని చెప్పి ముందుగా 20 వేల రూపాయలు తీసుకున్నాడు. తర్వాత ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ముజమ్మిల్ తన బంధువు సలామత్‌తో కలిసి బీహార్ రాష్ట్రంలోని ముంగేర్‌కు వెళ్లి తబీష్ అనే వ్యక్తి వద్ద నుంచి 35 వేల రూపాయలకు ఒక దేశీయ తుపాకీ, పది లైవ్ రౌండ్లు, రెండు మ్యాగజైన్‌లు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని అరుణ్ కుమార్‌కు ఇచ్చి ఒక లక్ష పది వేల రూపాయలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల అరుణ్ కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో తుపాకీతో రెండు రౌండ్లు కాల్చి ప్రాక్టీస్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఒక మ్యాగజైన్‌ను అక్కడే కోల్పోయినట్లు వెల్లడైంది. తన రెండో భార్యను హత్య చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ అంబర్‌పేట్‌లో సమావేశమైన సమయంలో పోలీసులు దాడి చేసి ముగ్గురినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో తబీష్, సలామత్ అనే ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :