DNB News - తెలంగాణ / : కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేనేలేదు చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ముడుపులు దండుకునేందుకు విచారణ పేరుతో సాగదీతలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలన్నీ ఉన్నాయి పోలీసులే విచారణ సందర్భంగా నాకు ఆధారాలు, సాక్షాలు చూపారు అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మంది కొంపలు ముంచిన కేటీఆర్ వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడటమా? మా కార్యకర్తలను కొట్టి హింసించి అడుగడుగునా వేధించిన ద్రుశ్యాలు ఇంకా నా కళ్లముందే కన్పిస్తున్నాయి నాడు కేటీఆర్ చేసిన అరాచకాలు గుర్తుకొస్తే మా రక్తం మరుగుతోంది మేం అధికారంలోకి వచ్చి ఉంటే.... కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పే వాళ్లం రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు... చేవ చచ్చిపోయింది అధికారంలో ఉంటూ కోట్లు దండుకోవడంపైనా కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు కనీసం సిట్ అధికారులకైనా స్వేచ్ఛనివ్వండి వాళ్లపై జులుం ప్రదర్శిస్తే విచారణ నుండి తప్పుకునే ప్రమాదముంది బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచకాలపై చర్యలు తప్పవు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు కేటీఆర్ అరాచకాలపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి ఫోన్ ట్యాపింగ్ తోపాటు అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనేలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపులు కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు. విచారణ పేరుతో హడావుడి చేసినప్పుడల్లా ఫాంహౌజ్ నుండి ఏఐసీసీకి ముడుపులు వెళుతున్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్షాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలో ఆ ఆధారాలను, సాక్షాలను సైతం చూపించారని తెలిపారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తేలిందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈరోజు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోపాటు కేటీఆర్ అరాచకాలను వివరిస్తూ తీవ్రస్థాయిలో స్పందించారు. ఏమన్నారంటే... ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ టీవీ సీరియల్ ను మించి ఆది అంతం లేకుండా కొనసాగుతూనే ఉంది. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేస్తున్నారు. నిజానికి సిట్ అధికారులు సమర్ధులు, నిజాయితీపరులు. కానీ వాళ్లపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోంది. ఆ పెద్దలు ఎవరిని పిలవమని అడిగితే వాళ్లనే పిలిచి విచారణ చేస్తున్నారు.నేనడుగుతున్నా.. కేటీఆర్ ను ఎందుకు విచారణకు పిలిచారు? ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు పిలిచారా? లేక ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని చెప్పడానికి పిలిచారా? సిరిసిల్ల కేంద్రంగా వార్ రూంను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని నేను చాలా సార్లు చెప్పిన. యువరాజు కేటీఆర్ ఆడిందే ఆటగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పాలనను కొనసాగించారు. బ్రిటీష్ పాలన తరహాలో పాలన చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులను, సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారు. బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేయించారు. నా ఫోన్లను, ప్రస్తుత సీఎం, మంత్రుల ఫోన్లతోపాటు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసింది. అసలు కారకులైన వాళ్లను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలం నమోదు చేయడమేంటి? రెండేళ్ల విచారణలో సిట్ సాధించిందేమిటి? ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా? ఎన్ని ఆస్తులు జప్తు చేశారు? ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు?... స్వయంగా కేసీఆర్ కూతురే తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. మాజీమంత్రి హరీష్ రావు ఆ టైంలో ఏడాదిపాటు ఫోన్ కూడా వాడలేదు. ఇన్ని సాక్షాలు, ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కేసీఆర్ పాలనలో సామాన్యులు మొదలు భిక్షాటన చేసే వ్యక్తులు కూడా ఫోన్ ఉన్నా వాట్సప్ కాల్ లో తప్ప నార్మల్ కాల్ మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దారుణానికి దొంగలను పిలిచి ‘మీ ఫోన్ ట్యాప్ చేశారా?’అని విచారణకు పిలవడం ఏంది?అసలు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో టైం పాస్ విచారణ చేస్తున్నారు. సిట్ అధికారులు మంచి అధికారులు. వాళ్లకు స్వేచ్ఛనిచ్చి విచారణ జరిగేలా చూడాలి. అట్లా కాకుండా ప్రభుత్వ వ్యవహారశైలికి విసిగిపోయి సిట్ నుండి తప్పుకునే ప్రమాదముంది.
Admin
DNB News