DNB News - తెలంగాణ / : వివిధ కార్యాచరణలో భాగంగా గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగను. కాకర్ల గ్రామంలో మాదిగ ఐక్యవేదిక సుజాతనగర్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు, సుజాతనగర్ మండల ప్రాంతంలో రాఘవాపురం. సింగభూపాలెం గ్రామాలలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాలను త్వరలో ప్రారంభోత్సవం చేయుటకు ముఖ్యఅతిథిగా రావాలని కోరారు, ఈ సందర్భంగా పూలబోకై అందించి శాలువాతో సత్కరించారు, సానుకూలంగా స్పందించిన ఆయన విగ్రహాల ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, హామీ ఇవ్వడం ఎంతో సంతోషకరమని ఐక్యవేదిక నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్య వేదిక సుజాతనగర్ మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్ ,కార్యదర్శి గుండేటి వెంకట రాములు ,సహాయ కార్యదర్శి కేసు పాక వెంకటేశ్వర్లు ,మండల నాయకులు వేల్పుల రాజు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News