DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని విజయరామపురం గ్రామంలో మూడు దశాబ్దాల క్రితం స్థాపించబడిన అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అభివృద్ధికి సామాజిక సేవా కార్యక్రమాలకు అగ్రగామిగా నిలుస్తుంది, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ పెద్దలసహకారంతో, యువతలో సామాజిక స్పృహ పెంచే విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతి కుటుంబానికి తోడ్పాటుగా నిలుస్తుంది, ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన పంది గాలమ్మ, అనారోగ్యంతో మరణించడం జరిగింది, వారి కుటుంబానికి దశదిన కార్యక్రమానికి, సోమవారం అంబేద్కర్ యువజన సంఘం వారు గ్రామ పెద్దల సహకారంతో 50 కేజీల రైసు, 25000/ వేలరూపాయల నగదును అందజేశారు, ఇలాంటి సందర్భాలలో దుఃఖంలో ఉన్న కుటుంబాలకు చేయూతనిస్తూ, అంబేద్కర్ యువజన సంఘం ఎల్లప్పుడూ ముందుండి స్ఫూర్తిదాయకంగా వ్యవహరించడం ఒకగొప్ప విషయం,నిజంగాఈసంఘం కార్యకలాపాలు అంబేద్కర్ ఆలోచనలతో,సామాజిక న్యాయం,భావజాలంతో ముందుకుసాగుతున్నాయి, ఈకార్యక్రమంలో,అంబేద్కర్ యువజనసంఘం అధ్యక్షుడు కత్తి శ్రీను,గౌరవఅధ్యక్షులు రేమిడాల లింగయ్య,ఉపసర్పంచ్ కత్తి వెంకటేశ్వర్లు,మాజీఉపసర్పంచ్ కత్తికోటయ్య,సోమపంగురాములుకత్తి గోపి,కొత్తపల్లి అంజయ్య, సోమపంగురమణయ్య,కత్తి వెంకటేశ్వర్లు,కొత్తపల్లి నరసయ్య, కత్తి శ్రీను,ఈరి ఎంకన్న, తదితరులుపాల్గొన్నారు.
Admin
DNB News