DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రోజురోజుకు మరింత బలోపేతం అవుతోందని ఆదోని ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారధి తెలిపారు. స్థానిక ఎల్.బి. స్ట్రీట్లో ప్రముఖ నాయకుడు ఎం. ఆదినారాయణ ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో అధికారికంగా చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కొత్త సభ్యులకు ఎమ్మెల్యే డా. పార్థసారధి కండువాలు కప్పి పార్టీ తరఫున ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలతో బీజేపీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు. ప్రధానమంత్రి మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదోని అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని, నియోజకవర్గ ప్రగతికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎం. ఆదినారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే డా. పార్థసారధి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితులై తాము బీజేపీలో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆదోనిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విట్టా రమేష్, కునిగిరి నీలకంఠ, ఉపేంద్ర కుమార్, నాగరాజు గౌడ్, భీమా, నాగార్జున, ఉషా రాజ్, సురేష్, రాజు, రసాలే గోవిందు, జాఫర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News