Saturday, 01 August 2026 05:54:38 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం..

Date : 13 June 2026 10:14 AM Views : 79

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రోజురోజుకు మరింత బలోపేతం అవుతోందని ఆదోని ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారధి తెలిపారు. స్థానిక ఎల్.బి. స్ట్రీట్‌లో ప్రముఖ నాయకుడు ఎం. ఆదినారాయణ ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో అధికారికంగా చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కొత్త సభ్యులకు ఎమ్మెల్యే డా. పార్థసారధి కండువాలు కప్పి పార్టీ తరఫున ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలతో బీజేపీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు. ప్రధానమంత్రి మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదోని అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని, నియోజకవర్గ ప్రగతికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎం. ఆదినారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే డా. పార్థసారధి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితులై తాము బీజేపీలో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆదోనిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విట్టా రమేష్, కునిగిరి నీలకంఠ, ఉపేంద్ర కుమార్, నాగరాజు గౌడ్, భీమా, నాగార్జున, ఉషా రాజ్, సురేష్, రాజు, రసాలే గోవిందు, జాఫర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :