DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయనగరం,: జిల్లాలో ఉద్యాన సాగుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.వరి పంట కంటే ఎక్కువ లాభం ఉద్యాన వనాల ద్వారా అందుతుందని,అందుకోసం జిల్లాలో 10 వేళా ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు.శుక్రవారం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ అనంతరం కలెక్టర్ మీడియా వారితో మాట్లాడారు.జిల్లాలో 696 రెవిన్యూ గ్రామాల్లో ఆదర్శ రైతుల్ని గుర్తించామని,వచ్చే ఖరీఫ్ నాటికి 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల కోసం ప్రణాళిక వేయడం జరిగిందన్నారు.స్వయం సహాయక సభ్యుల ద్వారా 5గురును గ్రూప్ గా చేసి స్త్రీ నిధి రుణాలను తక్కువ వడ్డీకే మంజూరు చేసి బోర్ వెల్స్ ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.5 ఎకరాల విస్తీర్ణంలో రైతుల ఎంపిక మేరకు ప్రకృతి వ్యవసాయానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన కూరగాయలు,ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు.విజయనగరం, విశాఖపట్నంలలో నున్న రైతు బజార్లకు వీరిని ట్యాగ్ చేయడం జరుగుతుందని,ప్రైవేట్ వర్తకులతో కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు.ఆయిల్ పామ్ వలన కూడా లాభాలు వస్తాయని,నాలుగేళ్లలో చేతికి అధిక లాభాలు వస్తాయని,ఈ లోపల అంతర్ పంటలను కూడా వేసుకోవచ్చు నని పేర్కొన్నారు.జిల్లాలో సంప్రదాయ పంటల నుండి రైతును మళ్లించి వాణిజ్య పంటల దిశగా తీసుకువచ్చి, రైతుకు అధిక ఆదాయం సమకూర్చే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
Admin
DNB News