Monday, 16 March 2026 05:13:09 PM
# ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు # ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ

ఉద్యాన సాగు వృద్ధే లక్ష్యం, జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక డి.ఆర్.డి.ఏ ద్వారా రుణాలు పాత్రికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్

Date : 31 January 2026 12:58 PM Views : 29

DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయనగరం,: జిల్లాలో ఉద్యాన సాగుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.వరి పంట కంటే ఎక్కువ లాభం ఉద్యాన వనాల ద్వారా అందుతుందని,అందుకోసం జిల్లాలో 10 వేళా ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు.శుక్రవారం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ అనంతరం కలెక్టర్ మీడియా వారితో మాట్లాడారు.జిల్లాలో 696 రెవిన్యూ గ్రామాల్లో ఆదర్శ రైతుల్ని గుర్తించామని,వచ్చే ఖరీఫ్ నాటికి 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల కోసం ప్రణాళిక వేయడం జరిగిందన్నారు.స్వయం సహాయక సభ్యుల ద్వారా 5గురును గ్రూప్ గా చేసి స్త్రీ నిధి రుణాలను తక్కువ వడ్డీకే మంజూరు చేసి బోర్ వెల్స్ ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.5 ఎకరాల విస్తీర్ణంలో రైతుల ఎంపిక మేరకు ప్రకృతి వ్యవసాయానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన కూరగాయలు,ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు.విజయనగరం, విశాఖపట్నంలలో నున్న రైతు బజార్లకు వీరిని ట్యాగ్ చేయడం జరుగుతుందని,ప్రైవేట్ వర్తకులతో కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు.ఆయిల్ పామ్ వలన కూడా లాభాలు వస్తాయని,నాలుగేళ్లలో చేతికి అధిక లాభాలు వస్తాయని,ఈ లోపల అంతర్ పంటలను కూడా వేసుకోవచ్చు నని పేర్కొన్నారు.జిల్లాలో సంప్రదాయ పంటల నుండి రైతును మళ్లించి వాణిజ్య పంటల దిశగా తీసుకువచ్చి, రైతుకు అధిక ఆదాయం సమకూర్చే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :