Thursday, 23 April 2026 06:52:28 PM
# ప్రైవేట్ స్కూల్స్ అక్రమాలకు అండగా ఉన్న డిప్యూటీ డీఈఓను సస్పెండ్ చేయాలి – ఎస్‌ఎఫ్ఐ డిమాండ్... # కర్నూల్–కొత్తకోట విద్యార్థి బస్సు మే 10 వరకు కొనసాగింపు – కాంగ్రెస్ నేత అనంతరత్నం మాదిగ డిమాండ్... # సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత

ప్రైవేట్ స్కూల్స్ అక్రమాలకు అండగా ఉన్న డిప్యూటీ డీఈఓను సస్పెండ్ చేయాలి – ఎస్‌ఎఫ్ఐ డిమాండ్...

Date : 23 April 2026 05:11 PM Views : 1

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా నిలుస్తున్న డిప్యూటీ డీఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ—పట్టణంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తమ పాఠశాలలో చేర్పించాలని ఒత్తిడి తెస్తూ, పుస్తకాలు, టై, బెల్ట్ పేర్లతో తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ డీఈఓ తన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ అనేకమంది కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. డిప్యూటీ డీఈఓ తన నివాసాన్ని కార్యాలయంగా మార్చుకుని అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. ఏ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయాలన్నా సాయంత్రం తర్వాత ఇంటికి రావాలని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి, సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :