DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను కోరింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా, తాజాగా మరియు పొరపాట్లేమీ లేకుండా రూపొందించడమే SIR కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆదోని నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన BLAలు, ప్రభుత్వ అధికారులైన BLOలు, సంబంధిత ఎన్నికల అధికారులు కలిసి పాల్గొనే విధంగా ముందస్తు సమాచారం ఇచ్చి సమన్వయ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా SIR కార్యక్రమంపై స్పష్టమైన అవగాహన కలిగి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు దేవా కౌన్సిలర్ బాలాజీ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News