DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలోని రాయలసీమ మిల్లులో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మిల్లు యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రాయలసీమ మిల్లు కార్మికుల పీఎఫ్ బకాయిల సమస్య పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమని ఐఎఫ్టీయూ నాయకులు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయిల కోసం కార్మికులు నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. సుమారు రూ.85 లక్షల పీఎఫ్ బకాయిల అంశంలో కోర్టులో స్టే ఉన్నప్పటికీ, సమస్య పరిష్కారానికి సాయిప్రసాద్ రెడ్డి ముందుకు రావడం కార్మికులకు ఊరటనిచ్చిందన్నారు. ఇంకా రూ.80 లక్షల వరకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, మిగిలిన సమస్యలు కూడా త్వరలో పరిష్కారం అవుతాయని ఆయన హామీ ఇచ్చారని కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరంతర పోరాటం కొనసాగించారని, యాజమాన్యంతో జరిగిన చర్చల ఫలితంగానే ఈ సమస్యలో కదలిక వచ్చిందన్నారు. కార్మికుల పక్షాన నిలబడి సహకరించిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఐఎఫ్టీయూ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
DNB News