DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మహిళల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ హుస్సేన్ పీరా గారి పర్యవేక్షణలో ఈరోజు కర్నూలు డిపిఓ కార్యాలయంలో సిబ్బందికి ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని టగ్ ఆఫ్ వార్ (Tug of War), షాట్ పుట్ (Shot Put), త్రో బాల్/టెన్నికాయిట్ (Tennikoit), మ్యూజికల్ చెయర్స్ (Musical Chairs) వంటి ఆటలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలు సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంపొందించడమే కాకుండా పరస్పర సహకారం మరియు స్నేహభావాన్ని పెంపొందించడానికి దోహదపడినట్లు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారతకు, వారి ఆరోగ్యం మరియు సంతోషానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు మరియు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఏవో విజయలక్ష్మి, డిపిఓ కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, ఆర్ ఐ నారాయణ, ఆర్ ఎస్ ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News