DNB News - ఆంధ్రప్రదేశ్ / : నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కొల్లి షణ్ముఖరావు గారు ఇటీవల హైదరాబాద్ లో కరెంటు షాక్ తో మరణించితిరి.ఈ విషయం తెలుసికొని టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ గారు ఈరోజు దిమ్మిడిజోల గ్రామంలో అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేగల లక్ష్మీకాంతం-కూర్మారావు,మండల పార్టీ అధ్యక్షులు తమిరె పాల్గుణరావు,సర్పంచ్ మడపాల సంజీవరావు,మాజీ సర్పంచ్ కొల్లి శ్రీరాములు, మండల రైతు సంఘము అధ్యక్షుడు శ్యామసుందరరావు, టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ యువజన అధ్యక్షులు చిన్ని జోగారావు యాదవ్,కొల్లి బాలకృష్ణ,కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News