DNB News - ఆంధ్రప్రదేశ్ / : 2019 నుంచి 2024 వరకు కొనసాగిన గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో ముమ్మాటికి కల్తీ నెయ్యి వాడినట్లు సిట్ అధికారులు తేల్చిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఈ రోజు కర్నూలు నగరంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొరకంచి రవికుమార్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నందు పూజారుల సమక్షంలో దేవాలయ సంప్రోక్షణ నిర్వహించి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, రాష్ట్ర డైరెక్టర్లు సంజీవ లక్ష్మి (బోయ కార్పొరేషన్), ఆనంద్ రావు (బ్రాహ్మణ కార్పొరేషన్) పాల్గొన్నారు. అలాగే జిల్లా పార్టీ కమిటీ సభ్యులు సోమిశెట్టి శ్రీకాంత్ (ఉపాధ్యక్షులు), రాజశేఖర రెడ్డి (కార్యాలయ కార్యదర్శి), కార్పొరేటర్లు సుంకన్న, కె. పరమేష్, పెనికలపాటి నాగేశ్వరరావు, రవి తదితరులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, తిరుమల లడ్డు వంటి పవిత్ర ప్రసాదంలో కల్తీ జరగడం అత్యంత దురదృష్టకరమని, ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని వారు స్పష్టం చేశారు.
Admin
DNB News