DNB News - ఆంధ్రప్రదేశ్ / : బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారంతో జరుపుకోవాలని కర్నూలు ఒకటవ పట్టణ సీఐ మారుతి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా కర్నూలు వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి హిందూ, ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు హాజరయ్యారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ, శాంతియుత వాతావరణంలో పండుగ వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా, అనుమానాస్పద సమాచారం గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, అందరూ పోలీసులకు సహకరించాలని సీఐ మారుతి శంకర్ విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News