DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు సూచనలతో బైచిగేరి గ్రామంలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించి రైతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా రైతులకు విడతల వారీగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో సుమారు రూ.6,309 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న “అన్నదాత సుఖీభవ” పథకం కింద సంవత్సరానికి రూ.14,000, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Kisan సమ్మాన్ నిధి పథకం కింద రూ.6,000 చొప్పున మొత్తం రూ.20,000 రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, గ్రామ నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News