Sunday, 02 August 2026 08:33:44 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

రీ సర్వే పనుల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం: జేసీ నూరుల్ ఖమర్.

Date : 30 April 2026 11:00 AM Views : 81

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రైతుల భాగస్వామ్యంతో రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని మండలాల్లో జరుగుతున్న రీ సర్వే, పి.జి.ఆర్.ఎస్, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ మరియు రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రీ సర్వే పనులను సమయపాలనతో పాటు నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మొదటి దశలో 9 మండలాల్లో 9 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 13 నోటిఫికేషన్ స్థాయిని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. రెండవ దశలోని 9 గ్రామాల్లో కూడా 13 నోటిఫికేషన్ పూర్తి చేసి తుది దశలో ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు దశల్లో మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. మూడవ దశలో 16 గ్రామాల్లో పనులు ప్రస్తుతం డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ దశలో ఉండగా, వాటిని మే 3వ తేదీ లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. నాలుగవ దశలో 17 గ్రామాల్లో రీ సర్వే పూర్తై వీఆర్వో, విలేజ్ సర్వేయర్ లాగిన్ దశలో ఉందని తెలిపారు. ఐదవ దశలో 15 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ దశ కొనసాగుతోందని, ఈ దశలో రైతుల భాగస్వామ్యాన్ని పెంచి పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాలను 100 శాతం పూర్తి చేసి, మే–జూన్ నెలల్లో రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మార్చి 2027 నాటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పూర్తిచేసి ప్రతి అర్హ రైతుకు పాసుపుస్తకాలు అందించాలన్నారు. అదేవిధంగా ఎఫ్-లైన్, మ్యుటేషన్, ఆర్.ఓ.ఆర్ వంటి రెవెన్యూ సేవల్లో ప్రజలకు సంతృప్తికర సేవలు అందేలా చూడాలని, పి.జి.ఆర్.ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించలేని పరిస్థితిలో స్పష్టమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియలో వేగం, ఖచ్చితత్వం, పారదర్శకతతో రైతులకు న్యాయం జరిగేలా ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాసిల్దార్ శేషఫణి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాసరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: