DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో, ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 45 మంది బాధితులకు కలిపి రూ.18,14,655 విలువైన చెక్కులను టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు మరియు ఇతర సంక్షేమ కారణాల కోసం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న దానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఇప్పటివరకు ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు సహకారంతో 564 మందికి రూ.20,37,84,13 రూపాయల సహాయం అందించామని, ఇంకా 289 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు త్వరలో అందనున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి నాయుడు, మండల అధ్యక్షుడు శివప్ప, కర్నూల్ పార్లమెంట్ టిడిపి వైస్ ప్రెసిడెంట్ రంగన్న, 1వ వార్డ్ మాజీ కౌన్సిలర్ వెంకటేష్, మాజీ కౌన్సిలర్ అంజి, జయరాం, గిడ్డయ్య, శ్రీరాములు, దిబ్బనకల్ లక్ష్మన్న, విరుపాపురం వీరేష్, వలమన్న తదితరులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News