DNB News - ఆంధ్రప్రదేశ్ / : బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మే 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు కర్నూలు రీజినల్ SBISUAC కార్యదర్శులు K. రవికుమార్, రాజశేఖర్ తెలిపారు. ఆదోనిలోని ఎస్బీఐ శాఖ ఎదుట నిర్వహించిన మౌన దీక్షలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. వారు పేర్కొన్న ప్రధాన డిమాండ్లు ఇవి: * గత 29 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మెసెంజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. * సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలి. * సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వహించే పరిస్థితిని నిలిపివేయాలి. * శాశ్వత పనులను అవుట్సోర్సింగ్కు అప్పగించడం ఆపాలి. * ప్రస్తుత వైద్య ఖర్చులకు అనుగుణంగా మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ను సవరించాలి. ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యం స్పందించకపోతే సమ్మె తప్పదని నాయకులు హెచ్చరించారు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Admin
DNB News