DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న భాష్యం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆదోని పట్టణంలోని కార్పొరేట్ భాష్యం పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ డీఎస్ఎఫ్, పీడీఎస్వో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్వో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటించినప్పటికీ భాష్యం పాఠశాల యాజమాన్యం సెలవు దినాల్లో కూడా టీచర్లతో పని చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే “మా పాఠశాల.. మా ఇష్టం” అంటూ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో దురుసుగా మాట్లాడడం దారుణమన్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ముందస్తు అడ్మిషన్ల కోసం టీచర్లపై ఒత్తిడి తెస్తూ, ఒక్కో టీచర్కు నిర్దిష్ట సంఖ్యలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు విధించడం అన్యాయమని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. భాష్యం పాఠశాల యాజమాన్యంపై, అలాగే ప్రిన్సిపాల్ సురేంద్రపై సమగ్ర విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, హరి, విక్రమ్, పీడీఎస్వో నాయకులు రఘు, అమర్నాథ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News