Saturday, 19 September 2026 08:26:16 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆదోని ట్రాఫిక్ సిగ్నల్స్ అవినీతి పై విచారణ జరపాలి- నూర్ డిమాండ్...

Date : 02 February 2026 11:39 AM Views : 161

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహమ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదోనిలో పాత బ్రిడ్జి వద్ద ఉన్న డివైడర్‌ను తొలగించి, శ్రీనివాస భవన్, బంగారు బజారు, దాదా సోడ షాపు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. భీమాస్ మరియు కంట్రోల్ రూం వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ప్రజలకు సమయం వృధా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని, అందువల్ల ఆ రెండు చోట్ల సిగ్నల్స్‌ను తొలగించాలని నూర్ అహమ్మద్ విజ్ఞప్తి చేశారు. ఆదోనిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వల్ల మాత్రమే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావని, పట్టణ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసి రోడ్ల విస్తరణ చేపడితేనే సమస్య కొంతమేరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం పేరిట ఉన్న సిగ్నల్స్‌ను మరమ్మతులు చేయకుండా తొలగించి, రూ.36 లక్షల వ్యయంతో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడంలో అవినీతి జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నూర్ అహమ్మద్ అన్నారు. ఈ విషయంపై ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మరియు ఉన్నతాధికారులు విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు షకీల్, విద్యార్థి సంఘాల నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :