DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu గారు విద్యార్థుల చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరింపజేశారు. "ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలనే తేడా లేకుండా.. 'భారతదేశం నా మాతృభూమి' అనే ప్రతిజ్ఞను విద్యార్థులతో తప్పనిసరిగా చేయించాలి. కులమతాలకు అతీతంగా మనమంతా భారతీయులం అనే భావన వారిలో నింపాలి" అని నాగబాబు గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వినీ, జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు డాక్టర్ పంచకర్ల సందీప్, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ శ్రీ గేదెల చైతన్య, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ గర్భాన సత్తిబాబు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ దాసరి రాజు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ దుర్గారావు, జీసీసీ డైరెక్టర్ శ్రీ నిబ్రమ్, ఆముదాలవలస పీఏసీ శ్రీ పెదాడ రామ్మోహన్, టెక్కలి పీఓసీ శ్రీ కణితి కిరణ్, నరసన్నపేట పీఓసీ శ్రీ బలగ ప్రవీణ్, శ్రీకాకుళం నియోజకవర్గం POC శ్రీ కోరాడ సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News