Saturday, 01 August 2026 08:04:10 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆదోనిలో ₹36 లక్షల ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవహారం పై ఆర్టీఐ బాంబు – పూర్తి వివరాలు వెల్లడి చేయాలని నూర్ డిమాండ్..

Date : 18 February 2026 11:15 AM Views : 116

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో పాత ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగంలో ఉండగానే కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ఆర్టీఐ ద్వారా వివరాలు కోరారు. సుమారు రూ.36 లక్షల వ్యయంతో కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో, పాత సిగ్నల్స్ పనికిరావని ఎవరైనా నిపుణులు నివేదిక ఇచ్చారా? ఇచ్చినట్లయితే ఆ నివేదిక ప్రతిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు ఆదోని పురపాలిక సంఘం కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తులో పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. ప్రస్తుతం పాత ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో వివరాలు, కొత్త సిగ్నల్స్ కొనుగోలు రసీదుల ప్రతులు, టెండర్ ప్రక్రియ వివరాలు తదితర సమాచారాన్ని అందించాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే శ్రీనివాస భవన్ సమీపంలో డివైడర్ తొలగించినప్పటికీ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యం, రహదారి భద్రత దృష్ట్యా సరైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ప్రజా ధన వినియోగంలో పారదర్శకత ఉండాలని, ప్రతి రూపాయి ఖర్చుకు స్పష్టమైన లెక్కలు ఇవ్వాల్సిందేనని నూర్ స్పష్టం చేశారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :