DNB News - ఆంధ్రప్రదేశ్ / : డీఎస్ఏ (DSA) సహకారంతో ఫిలిప్స్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. గత నెల మే 14 నుండి జూన్ 14 వరకు అరుణ్ జ్యోతి నగర్లోని అరులయ్య గుడి వెనుక ఉన్న కబడ్డీ కోర్టులో నెల రోజుల పాటు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. వివిధ వీధులు, ప్రాంతాల నుండి సుమారు 50 మంది కబడ్డీ క్రీడాకారులు పాల్గొని శిక్షణ పొందారు. క్యాంప్ ముగింపు సందర్భంగా ఫిలిప్స్ కబడ్డీ అసోసియేషన్ సీనియర్ క్రీడాకారులు పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రామన్న, మారెన్న, రామాంజి, జయరాం, దుబ్బా గోపి, నాగరాజు, పరిష్, ఎల్లప్ప, కోచ్ గోవిందు, కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎస్. అమర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News