DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి. సోమన్న, ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష మాట్లాడుతూ, జిల్లాలోని అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు చేపడుతూ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతున్నాయని తెలిపారు. నగరంలో భారీ ఫ్లెక్సీలు, ప్రకటనల ద్వారా ఆకర్షణీయ ప్రచారాలు నిర్వహిస్తూ, ఇంటింటికి వెళ్లి అడ్మిషన్లు చేపడుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వ నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పర్యవేక్షణ లోపమే ఈ దోపిడికి కారణమని అన్నారు. వెంటనే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. డిమాండ్లు: ముందస్తు అడ్మిషన్లను తక్షణమే నిలిపివేయాలి గుర్తింపు లేని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి అక్రమ ఫీజు వసూళ్లను పూర్తిగా అరికట్టాలి బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి సి. అశోక్, నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News