Friday, 17 April 2026 05:06:48 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

మీడియా సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

Date : 10 April 2026 02:45 PM Views : 116

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మతి స్థిమితం లేని మంత్రి వాఖ్యలు ​అచ్చెన్నాయుడూ.. నోరు అదుపులో పెట్టుకో వైఎస్సార్ మరణంపై నీ వ్యాఖ్యలు నీచాతి నీచం మీడియా సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాలవలస,ఏప్రిల్ 10​: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమదాలవలస తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసం చనిపోయిన వ్యక్తిపై బురద చల్లడం అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు.వైఎస్సార్ మరణించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నారంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ,ఆనాడు తండ్రి మరణవార్త విని కుప్పకూలిపోయిన కుటుంబానికి జగన్ అండగా ఉండి,అంత్యక్రియల వరకు అన్ని తానై చూసుకున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని, నీ రాజకీయ లబ్ధి కోసం ఇన్ని అబద్ధాలు ఆడతావా అని నిలదీశారు.మంత్రి అచ్చెన్నాయుడి విమర్శలకు కౌంటర్ ఇస్తూ,గార మండలం సింగపురం దగ్గర ఎర్రన్నాయుడుపై జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనలో నీ హస్తం లేదని చెప్పగలవా అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రణస్థలం మండలం వద్ద ఎర్రంనాయుడు వాహన ప్రమాదంలో మృతి చెందిన ఘటనలో నీ హస్తం లేదని చెప్పగలవా అంటూ తమ్మినేని ప్రశ్నించారు.వైఎస్సార్ పాదయాత్ర ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని,ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్,ఉచిత విద్యుత్ వంటి పథకాలు తరాల జీవితాలను మార్చాయని గుర్తు చేస్తూ,అలాంటి మహనీయుడిపై విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడమేనని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో 'మావిగన్' ప్లాన్-బి కి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని,అమరావతిలో జరుగుతున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు ఇటువంటి నీచమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.'అమరావతి వద్దు.. మావిగన్ ముద్దు' అని ప్రజలు అంటున్నారని,ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే అచ్చెన్నాయుడు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తమ్మినేని సీతారాం ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు బూర్జ జడ్పిటిసి బెజ్జపురం రామారావు బూర్జ ఎంపీపీ ప్రతినిధి కర్ణెన నాగేశ్వరరావు ఆముదాలవలస మాజీ జడ్పిటిసి బొడ్డేపల్లి నారాయణరావు రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రెటరీ బెండి గాంధీ తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :