Friday, 17 April 2026 05:04:21 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న యం.ఎల్.ఏ ముప్పిడి..

Date : 17 March 2026 03:38 PM Views : 38

DNB News - ఆంధ్రప్రదేశ్ / : తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు,పొట్టి శ్రీరాములు జయంతి సరదర్బంగా కొవ్వూరు లోని కోట్లవారి సెంటర్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... తెలుగు జాతి ఉనికిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 'ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష.. మన భాషాభిమానానికి, ప్రాణత్యాగానికి, అలుపెరగని ప్రజాస్వామిక పోరాటానికి నిలువెత్తు నిదర్శనమని. నాటి ఆ చారిత్రక త్యాగాన్ని, తెలుగువారి ఐక్యతను స్మరించుకోవడానికి ఆయన 125వ జయంతి మనకందరికీ ఒక గొప్ప సందర్భమన్నారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష వ్యక్తిగత గుర్తింపు కోసం కాదు, అధికార కోసం కాదు. అది తెలుగు ప్రజల భాష, గుర్తింపు, ఆత్మగౌరవం కోసం చేసిన అత్యున్నత త్యాగం. ఆయన మరణం దేశ మనసాక్షిని మేల్కొలిపింది. ఆ త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి, భారతదేశ చరిత్రను ఒక కీలక మలుపు తిప్పింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రతి అభివృద్ధికి, ప్రగతికి, ప్రతి అవకాశానికి పునాది అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగమే. ఆయన త్యాగం వల్లే తెలుగు ప్రజలు గౌరవంగా, గర్వంగా జీవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీగా నిలిచింది. రాష్ట్ర గౌరవం కోసం త్యాగం చేసిన మహనీయులను ఎప్పటికీ గౌరవిస్తూ వస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ప్రతి ఇంటికి చేరేలా, ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నారు. అమరావతిలో నిర్మించిన ఒక సాధారణ విగ్రహం కాదు. అది తెలుగు ప్రజల తరపున అమరజీవికి అర్పించిన హృదయపూర్వక ఘన నివాళి.. త్యాగ దినోత్సవం జరుపుకోవడం అంటే కేవలం ఒక కార్యక్రమం కాదు. అది తెలుగు ప్రజలందరం కలిసి అమరజీవికి చెప్పే కృతజ్ఞత. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి, భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని మరింత గొప్ప దిశగా నడిపించే స్ఫూర్తిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోద్విసభ్య కమిటీ మెంబర్ కంటమణి రామకృష్ణ , మద్దిపట్ల శివరామ కృష్ణ , చైర్ పర్సన్ భావన రత్నకుమారి, యం.ఆర్.ఓ, యం. డి. ఓ, సూరపని చిన్ని, దాయన రామకృష్ణ, వేమగిరి వెంకట్రావ్ , మరపట్ల కళాధర్ చక్రవర్తి, నాళం శ్రీనివాస్ ,బేతిన నారాయణ ,కుప్పాల ప్రసాద్ ,పెనుమాక జయరాజు , సుంకర సత్తిబాబు ,బర్ల శ్రీను, వరిగేటి కాంతరాజు ,బొబ్బిలి పేర్రాజు, తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :