DNB News - ఆంధ్రప్రదేశ్ / : మెలియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే (1972–1978) స్వర్గీయ చుక్కా పగడాలమ్మ కుటుంబ సభ్యులను మాజీ శాసనసభ స్పీకర్ శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పరామర్శించారు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్వర్గీయ పగడాలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తమ్మినేని,ఆమె రాజకీయ జీవితం,ప్రజాసేవా తత్వం, నిరాడంబర వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు.పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ సేవా దృక్పథంతో రాజకీయాల్లో కొనసాగిన నాయకురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.రాజకీయాలను పదవుల కోసం కాకుండా ప్రజాసేవకు సాధనంగా భావించిన అరుదైన నాయకుల్లో చుక్కా పగడాలమ్మ ఒకరని తమ్మినేని సీతారాం అన్నారు.అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ,సామాన్య ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు.ప్రజా సేవే పరమావధిగా భావించి నిస్వార్థ రాజకీయాలకు ఆమె నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకులు ఆమె జీవన విధానం,సేవాభావం, తన జీవనశైలిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధిగా ఎదిగి, అనంతరం కూడా సాధారణ జీవితాన్ని గడపడం ఆమె మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News