DNB News - ఆంధ్రప్రదేశ్ / : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి సి. జోసెఫ్ విజయ్కు, తమిళ ప్రజలకు మరియు టీవీకే పార్టీ శ్రేణులకు ఎం హెచ్ పి ఎస్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత సాధారణ వ్యక్తులను ఎమ్మెల్యేలుగా గెలిపించడం, ఎన్నికలలో ఓటుకు డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా స్వచ్ఛమైన రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, కులమతాలు మరియు విద్వేష రాజకీయాలకు తావివ్వకుండా ప్రజల మద్దతు పొందడం విజయ్ సాధించిన అసాధారణ విజయమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా 26 సంవత్సరాల లోపు యువత అధిక సంఖ్యలో విజయ్కు అండగా నిలవడం ద్వారా యువత మార్పు, పారదర్శకత మరియు స్వచ్ఛమైన రాజకీయాలను కోరుకుంటున్నారనే విషయం స్పష్టమైందన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కూడా అడ్డదారులు తొక్కకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవడం ఆదర్శనీయమని కొనియాడారు. తమిళనాడులో విజయ్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.
Admin
DNB News