DNB News - ఆంధ్రప్రదేశ్ / : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే వందల సంఖ్యలో రోడ్లు నిర్మాణంకు శంకుస్థాపనలు చేసి పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. *తాడివలస పంచాయతీలో 2 కోట్ల 85 లక్షలు రూపాయలు తో నిర్మించిన పలు బీటీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ గౌరవ శ్రీ కూన రవికుమార్ పొందూరు మండలం తాడివలస పంచాయతీ పరిధిలో నిర్మించిన తాడి వలసR&B రోడ్డు నుండి phc వరకు మరియు లచ్చయ్య పేట నుండి కావలి గ్రామం వరకు పలు బీటీ రోడ్లును మరియు తాడి వలస గ్రామంలో నిర్మించిన పలు సిసి రోడ్లు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా రహదారులు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని, నాణ్యమైన రోడ్ల నిర్మాణం వల్ల ప్రజల జీవన విధానం మెరుగుపడటంతో పాటు వ్యవసాయ, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుందని అన్నారు. తాడివలస పంచాయతీ పరిధిలో ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోడ్ల సమస్యను పరిష్కరించగలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ బీటీ రోడ్ల ప్రారంభంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వృద్ధులు అందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అక్షరాలా అమలు చేస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఆముదాలవలస నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి పంచాయతీలో అవసరమైన ప్రతీ రోడ్డు వేస్తామని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, విద్యా మరియు వైద్య రంగాల్లో సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కావాలి గ్రీష్మ , ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, అధికారులు, చేశారు.
Admin
DNB News